భాగ్యనగరం బ్లాగు మిత్రులకు ఇదే నా ఆహ్వానం
14వ శతాబ్దికి చెందిన ఆలంకారికుడు ’ విశ్వనాథుడు ’ ప్రతిపాదించిన ” వాక్యం రసాత్మకం కావ్యం ” అన్న సూత్ర స్ఫూర్తితో ’ వాక్యం రసాత్మకం ’ పేరిట నేను తొలిసారి కొత్త ప్రయోగంగా, ’ ఏక వాక్య కవితల ’ సంపుటిని రచించినట్లు లోగడ తెలియజేసాను. ( అందులోని కొన్ని ఏక వాక్య కవితలను ఈ బ్లాగులో ధారావాహికంగా ప్రచురించడం కూడా జరిగింది. అప్పుడు కొన్ని వాదోపవాదాలు కూడా జరిగాయని కూడా మీకు గుర్తుండి ఉంటుంది. ) అయితే అది అంతకు ముందే ఒక గ్రంథంగా 2004వ సంవత్సరంలో ప్రచురింపబడి పలువురి మన్ననలనందుకొంది. పలు తెలుగు, ఆంగ్ల పత్రికలలో దానిపై మంచి సమీక్షలు కూడా వచ్చాయి.
ఇప్పుడా ఏక వాక్య కవితల సంపుటి ఆంగ్లంలోకి అనువదించబడింది. Former Registrar, Central Institute of English & Foreign languages ( ఇప్పుడు దీనిని The English and Foreign languages University గా మార్చారు. ) మరియు ’ త్రివేణి ’ ఆంగ్ల పత్రికా సంపాదకులు ఆచార్య ఐ.వి.చలపతిరావు; ఇంకా, Former Director of Translations, Govt. of A.P. శ్రీ గోవిందరాజుల రామకృష్ణారావు కలసి సంయుక్తంగా దానిని ఆంగ్లంలోకి అనువదించారు . ఆ గ్రంథం ఆవిష్కరణ సభ ఈ నెల 13వ తేది సాయంత్రం 6 గంటలకు హైదరాబాదులో నారాయణగూడలోని YMCA హాలులో నిర్వహించబడుతుంది.
ప్రముఖ కవి డా. జె. బాపురెడ్డి అధ్యక్షత వహించే ఈ సభలో ’ అణు ఇంధన సంస్థ ’ జనరల్ మానేజర్ శ్రీ పి.కె. బెనర్జీ ఈ గ్రంథాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఆ గ్రంథాన్ని ప్రముఖ రచయిత, వివిధ సాహితీ సాంస్కృతిక సంస్థల సారథి కీ.శే. వేమరాజు నరసింహారావుకు అంకితం చేయబడుతుంది. డా. ఐ. సత్యశ్రీ ; శ్రీమతి. యు.వి.ఎల్. ఆనంద గ్రంథ పరిచయం చేస్తారు.
Sarath 'Kaalam'
ఆగ 11, 2009 @ 23:43:03
సంతోషం. నేను హైదరాబాదులో వున్నట్లయితే తప్పక వచ్చేవాడిని.
Dr.Acharya Phaneendra
ఆగ 12, 2009 @ 06:25:16
శరత్ గారు !
కృతజ్ఞతలు !