మొన్న దివంగతులైన “చేకూరి రామారావు”(చేరా)గారు తెలుగు సాహిత్యరంగంలోని కొద్ది మంది గొప్ప విమర్శకులలో ఒకరు. వారి మృతి తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటు. ఆయన నా పద్యాన్ని చాల ప్రేమించేవారు. ఆ మహనీయునికి శ్రద్ధాంజలి ఘటిస్తూ … ఈ సందర్భంగా నా “మాస్కో స్మృతులు” గ్రంథానికి ఆ విమర్శక వరేణ్యులు వ్రాసిన ముందు మాటను, దానికి ఆ గ్రంథంలోనే నేను తెలిపిన కృతజ్ఞతా వాక్యాలతో కూడిన సమాధానాన్ని కూడా ఇక్కడ ప్రచురిస్తున్నాను. ఆస్వాదించండి.
– డా. ఆచార్య ఫణీంద్ర