ప్రపంచ తెలుగు మహాసభలలో నేను
పద్య కవిసమ్మేళనం సభాధ్యక్షునిగా ప్రసంగం చేస్తూ ..
ఆ పైన పార్లమెంట్ సభ్యులు శ్రీ వినోద్ గారిచే సత్కారం పొందుతూ …
ప్రపంచ తెలుగు మహాసభలు -2017 లో …
27 డిసెం 2017 వ్యాఖ్యానించండి
మేరీ .. యేసు .. సిలువ .. చర్చ్ ..
25 డిసెం 2017 1 వ్యాఖ్య
దత్తపది
మేరీ .. యేసు .. సిలువ .. చర్చ్ .. పదాలను ఉపయోగించి శ్రీ కృష్ణ స్తుతి కంద పద్యంలో –
తామే రీతిని గొలిచిన
భూమిని గల యే సుభక్త పుంగవులైనన్
క్షేమముగ భాసిలు వరము
స్వామి ముకుందు డిడు; నేల చర్చింపంగన్?
పూరణ : డా. ఆచార్య ఫణీంద్ర
(క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలతో …)
“నమస్తే తెలంగాణ” దినపత్రిక మెయిన్ పేపర్లో …
18 డిసెం 2017 వ్యాఖ్యానించండి
“నమస్తే తెలంగాణ” దినపత్రిక మెయిన్ పేపర్లో ఈ రోజు … “తెలంగాణ – తెలుగు భాష” అన్న నా వ్యాసం ప్రచురించబడింది. సాహిత్యాభిమానుల కోసం ఆ వ్యాసం లింక్ ఈ క్రింద ఇస్తున్నాను.
– డా. ఆచార్య ఫణీంద్ర
“ప్రపంచ తెలుగు మహా సభలు – 2017″లో …
15 డిసెం 2017 వ్యాఖ్యానించండి
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం హైదరాబాదులో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రపంచ తెలుగు మహా సభలు – 2017″లో భాగంగా 16 డిసంబర్ 2017 నాడు “రవీంద్ర భారతి”లో ఏర్పాటు చేయబడిన “పద్య కవి సమ్మేళనం”లో రెండవ సమావేశానికి సభాధ్యక్షత వహించవలసిందిగా నన్ను ఆహ్వానించారు. ఆ కరపత్ర వివరాలు మీ కోసం …
– డా. ఆచార్య ఫణీంద్ర